వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని సంకల్పంతో నందమూరి బాలకృష్ణ 13, 14 తేదీలలో సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ప్రచారంలో భాగంగా 13న ఉదయం కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. కదిరి సమావేశంలో పాల్గొంటారు. పుట్టపర్తి నియోజకవర్గం లోని కొత్తచెరువు కూడలిలోని సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి సింగనమల చేరుకునే అక్కడే బస చేస్తారు.