అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ శారద శంకరమఠం ఆలయంలో ఆది జగద్గురు శంకరాచార్య జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చక ప్రధాన పురోహితులు ప్రసన్న స్వామి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆలయం నుండి వినాయక సర్కిల్ వరకు వేదమంత్రోత్సరణతో బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శంకరాచార్య శోభాయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.