రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం రాత్రి విస్తృత ఎన్నికల ప్రచారం చేపట్టిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు టిడిపి హయాంలోనే రాయదుర్గం కాస్త అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. వైసిపి పాలనలో రాయదుర్గం అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే రాయదుర్గం ను మరింత అభివృద్ధి చేసి చూపుతానన్నారు.