ఆమదాలవలస పట్టణంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్టింగ్ చేసి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.