Top 10 viral news 🔥


ఘోర ప్రమాదం.. నలుగురు మృతి (వీడియో)
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట- ఖమ్మం హైవేపై చివ్వెంల మండల ఐలాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆగి ఉన్న లారీని ఓరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మృతులను ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బస్సు టైర్ పేలడంతోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది.