ఇచ్చాపురం మున్సిపాలిటీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం శుభ్రత పరిశుభ్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శాంతినికేతన్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఆ స్కూల్ చైర్మన్ డి కృష్ణమూర్తి రెడ్డి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. భోజనానికి ముందు తరువాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. మన చుట్టుపక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.