స్వచ్ఛమైన నీటిని ప్రతి ఒక్కరూ వినియోగిస్తే వ్యాధులు దూరమవుతాయని మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని పి. శిరీష తెలిపారు. బుధవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాధులు పట్ల అవగాహన సమావేశాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ. వేడి నీటిని తాగటం వలన సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.