కాలానుగుణంగా వస్తున్న మార్పులు వలన దోమలు వృద్ధి చెందడం జరుగుతుందని వాటిని నివారించేందుకు అవగాహన చేసుకోవాలని ఉర్లాం పీహెచ్సీ వైద్యాధికారిణి సుజాత పిలుపునిచ్చారు. బుధవారం నరసన్నపేట మండలం ఉర్లాం బాలుర బీసీ హాస్టల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దోమలతోనే డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.