ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భద్రత కల్పించడంతోపాటు ఉన్నతమైన భవిష్యత్తును అందించడం జరుగుతుందని ఎంఈఓ పేడాడ దాలినాయుడు పేర్కొన్నారు. నరసన్నపేట మండలం కోమర్తి పంచాయతీలో విద్యార్థులతో బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని మౌలిక పరిస్థితులను కల్పిస్తుందని, పిల్లలను బడిలో చేర్చాలన్నారు.