నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో వంశధార అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారని దీనిలో భాగంగా ఆమదాలవలస, హిరమండలం, నరసన్నపేట, టెక్కలి డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.