కామ్రేడ్ పైల వాసుదేవరావు వర్ధంతి సభ

73చూసినవారు
పలాస మండలం రిట్టపాడులో కామ్రేడ్ పైలా వాసుదేవరావు 14వ వర్ధంతి సభను ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి అధ్యక్షతన గురువారం ఘనంగా జరిగింది. పైలా స్మారక స్తూపం వద్ద పైల రామారావు, వంకల పాపయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో వంకల మాధవరావు మాట్లాడుతూ భారత విప్లవోద్యమంలో పైలా వాసుదేవరావు కీలకమైన పాత్ర పోషించారన్నారు. శ్రీకాకుళం సాయధ గిరిజన రైతాంగ పోరాటం నడిపిన వ్యక్తి ఆయనని అన్నారు.

సంబంధిత పోస్ట్