మున్సిపాలిటీలో అన్ని వార్డులకు తాగునీటిని సరఫరా చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకాంక్షించారు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య వేదిస్తోందన్నారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆమె అన్నారు.