కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్. నర్సింగరావు బుధవారం పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో జిల్లా అధ్యక్షులు సి. హెచ్. అమ్మన్నాయుడు అధ్యక్షతన సిఐటియు జిల్లా కమిటీ విస్తృత సమావేశం నిర్వహించారు. ముందుగా మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ విమలారణదివే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.