శ్రీకాకుళం నగరంలోని స్థానిక నక్కవీధిలో వెలసియున్న శ్రీ ఉమా జఠలేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఉదయం నుంచి వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో, 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. సాయంత్రం కల్యాణం నిర్వహణకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.