టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్ధుల చేత వివిధ యోగాసనాలు వేయించారు. అనంతరం యోగ ప్రాముఖ్యతను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. యోగా అనేక శారీరక మానసిక రుగ్మతలను దూరం చేయగలిగే ఏకైక సాధనం అని తెలిపారు.