వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకున్న వాలంటీర్లకు కోటబొమ్మాలిలో మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు. మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండన్నారు. అది అచ్చెన్నాయుడు చేయించినా సరే, కంప్లెంట్ చేయండని అన్నారు. ఆ తర్వాత నన్ను కలవండి ఆలోచిద్దాం అని ఆయన సూచించారు. వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.