సంతబొమ్మాలి మండలం డిజిపురం జడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఇన్స్ట్రక్టర్ కృష్ణవేణి, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుపతిరావు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కోత చైతన్య మాట్లాడుతూ యోగా వలన మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. చిన్నతనం నుంచి యోగా చేస్తే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులతో పలు ఆసనాలు వేయించారు.