ఆమదాలవలస నియోజక వర్గం ప్రజలు వారి సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యం అని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. బుధవారం ప్రజా దర్బారును తన కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఉదయం నుండే ప్రజలు అధిక సంఖ్యలో అర్జీలు ఇవ్వడానికి విచ్చేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.