ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రంలో గల టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు తదితర వాటిపై వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.