ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెరుగైన విద్య, భోజన సౌకర్యం అందరి విద్యార్థులకు అందజేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్పడం జరిగింది.