ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 9: 30 గంటలకు ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో రాయితీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమదాలవలస మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.