ఆముదాలవలసకు చెందిన సీనియర్ వైద్యుడు, టీడీపీ నాయకుడు డాక్టర్ చాపర సుధాకర్ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం నియమించింది. విజయవాడలోని యూనివర్సిటీకి ఆయనను ఎంపిక చేయడంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు డాక్టర్ సుధాకర్కు అభినందనలు తెలిపారు.