ఆముదలవలస రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. కుదిరం గేటు వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సుమారు 47 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు బిస్కెట్ కలర్ చొక్కా నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.