తనపై కొంత మంది రౌడీలు దాడికి పాల్పడ్డారని శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. ఆముదాలవలస పట్టణంలో సువ్వారి గ్రాండ్ కన్వెన్షన్ దగ్గర శుక్రవారం రాత్రి 8: 45 కు తన చిన్నకుమారుడుపై కొంతమంది రౌడీలు దాడిచేస్తున్న సంగతి తెలిసి అక్కడికి వెళ్లడంతో తనపై రౌడీమూకలు చేయిచేసుకుని తోసేసారని తెలిపారు. శనివారం ఆముదాలవలస పోలీసుల దృష్టికి తీసుకువెళ్లేమన్నారు.