బూర్జ మండల కేంద్రంలో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్లు, కన్వీనర్లకు ఎస్ఎంసీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎన్. శ్యాంసుందర్రావు హాజరయ్యారు. అనంతరం పాఠశాల యాజమాన్య కమిటీ విధులు, బాధ్యతలు, విధానాలు, పాఠశాల అభివృద్ధి పలు అంశాలపై అవగాహన కల్పించారు.