ఆముదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్ వాసుదేవరావు ప్రకటనలో శుక్రవారం వెల్లడించారు. రేపు ఉదయం 10గంటలకు ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని అన్నారు. పూర్తి సమాచారంతో మండలస్థాయి అధికారులు అలాగేఎంపీటీసీలు, సర్పంచ్ లు క్షేత్రస్థాయి అంశాలను చర్చించేందుకు విధిగా హాజరు కావాలని, సంబంధితశాఖ అధికారులు తగు సమాచారంతో హాజరుకావాలన్నారు