ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంతో అన్ని వర్గాల ప్రజలకు వృద్ధులకు చేయూతగా ఉంటుందని కణుగులవలస సర్పంచ్ నూక అప్పలసూరనాయుడు(రాజు) అన్నారు. గురువారం ఆముదాలవలస మండలం కణుగులవలస గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురైన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెంచిందన్నారు.