కుద్దిరాం సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

77చూసినవారు
కుద్దిరాం సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆముదాలవలస లోని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో కుద్దిరాం రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి 47 ఏళ్లు ఉంటుందని, బిస్కెట్ కలర్ చొక్కా, నలుపురంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు రిమ్స్ తరలించినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిసిన వారు జీఆర్పీ స్టేషన్ లో సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్