ఆముదాలవలస హై స్కూల్ మైదానంలో గడచిన 14 రోజులుగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ పాతపట్నం, నరసన్నపేట జట్లు మధ్య శనివారం పోటీ జరిగింది. పాతపట్నం జట్టు 16. 2 ఓవర్లలో 86 రన్స్ చేసి ఆల్ అవుట్ అవ్వగా నరసన్నపేట జట్టు 12. 1 ఓవర్లలో విజయం సాధించింది. ముఖ్య అతిథులుగా న్యాయవాది బొణిగి రమణ, కమర్షియల్ శాఖ అధికారి కె. నరసింహమూర్తి పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన జుట్టుకు మెమొంటోళ్లు అందజేశారు.