పొందూరు మండలం రాపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ పోటీలను నిర్వహించారు. ఈ మేరకు గెలుపొందిన క్రీడాకారులకు ఎస్ఐ సత్యనారాయణ బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.