శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా పి సి ఎన్ మాధవరావు మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అసోసియేషన్ తరపున రూ. లక్ష చెక్కును బుధవారం మాధవరావు కుటుంబ సభ్యులకు అందించారు. జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు కృష్ణం నాయుడు, కోశాధికారి భుజంగరావు, కార్యవర్గ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.