మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ పరిధి కొత్తవాని పేటకు చెందిన కొత్త రమణ మీనా భార్యాభర్తలు. మృతుడు రమణ నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడేవాడు. గురువారం వారి ఇంటివద్ద ఓ శుభకార్యం అనంతరం మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై బతకాలని లేదని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.