ప్రజా సమస్యలను పరిష్కరించటమే ధ్యేయంగా ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని రణస్థలం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వెనువెంటనే ఆదేశించారు. కొత్త పింఛన్లు, హౌసింగ్, రోడ్లు తదితర సౌకర్యాలపై 126 మంది దరఖాస్తులు అందజేశారు.