జి. సిగడాం మండలం పర్యటన ముగించుకుని శుక్రవారం అటుగా వెళ్తున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులో వెంకటాపురం జంక్షన్ వద్ద ఎక్కారు. ఈ మేరకు బస్సులో ఉన్న విద్యార్ధులు, వృద్ధుల్ని, మహిళలు, ప్రతి ఒక్కరితో చనువుగా మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రయాణికుల నుండి సానుకూల స్పందన రావడంతో ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.