లావేరు శాఖా గ్రంథాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు. వ్యాసరచన పోటీలు నిర్వహించగా, రఘు కృష్ణకు ప్రథమ బహుమతి సాధించారు. గ్రంథాలయ సహాయకులు టి. వీరభద్రుడు, విద్యార్థులు ఉన్నారు.