అల్లినగరంలో విద్యార్థులచే నేను బడికి పోతా కార్యక్రమం

70చూసినవారు
ఎచ్చెర్ల మండలం అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే శనివారం ఉదయం ప్రధానోపాధ్యాయులు పార్థసారథి ఆధ్వర్యంలో గ్రామంలో 'నేను బడికి పోతా' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో విద్యార్థులు 'పెద్దలు పనికి, పిల్లలు బడికి' అను నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రేణుక, సుశీల, రాజశేఖర్, నరసింహమూర్తి, పీడీ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్