ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో ఐసిడిఎస్ పిఓ డోల పాపినాయుడు ఆధ్వర్యంలో గురువారం పౌష్టికాహార పక్షోత్సవ 1000 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారాన్ని ప్రతీ రోజూ తీసుకోవాలని సూచించారు. తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త రాజ్యలక్ష్మి, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.