నుమద్ రేహిమ్ అనే బీహార్ యువకునికి రణస్థలం మండలం గుర్రాలపాలెం గ్రామస్థులు శనివారం ఉదయం సన్మానం చేశారు. బీహార్ నుంచి సైకిల్ పై భారతదేశం మొత్తం పర్యటిస్తున్న యువకుడుని రామతీర్థం జంక్షన్ కు రాగానే స్థానికులు ఆయనతో మాట్లాడారు. వివరాలు తెలుసుకొని అతని ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించారు. జనపాల గోవిందరావు, గురు భవాని రమణ దొర, రాజా, రమేష్, మూర్తి సన్మానించారు.