భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తికి తన పదవీ కాలంలో చేసిన సేవలతో బాగ గిరిధర్ వన్నెతెచ్చారని ఎంఈఓలు ఎస్. శివరాంప్రసాద్, కె. చిట్టిబాబు పేర్కొన్నారు. కంచిలి మండలం ఎక్కల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన బాగ గిరిధర్ ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఉద్యోగ కాలంలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం గిరిధర్ దంపతులను దుశ్శాలువతో సన్మానించారు.