ఇచ్చాపురం మండలంలోని కేదారి పురం, పాఠశాల సిబ్బంది ఆంధ్ర సరిహద్దు గ్రామాలైనటువంటి ముచ్చింద్ర, బెనుగానిపేట గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిటీ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అలాగే క్వాలిఫైడ్ సబ్జెక్టు టీచర్స్ ను నియమించిందని తల్లిదండ్రులందరూ పిల్లలును చేర్పించి డిజిటల్ విద్యను అందిపుచ్చుకోవాలని కోరారు.