ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి గ్రిగ్స్ పోటీలను కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో కూడా చురుగ్గా పాల్గొనాలన్నారు.