ఇచ్చాపురం నియోజకవర్గంలో శనివారం రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్ పైపుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పైపులను ఎమ్మెల్యే అశోక్ బాబు రైతులకు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా రైతులు ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యండిఓ, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.