కంచిలి: 'ఆపరేషన్ సింధూర్'కు నర్తు రామారావు సంఘీభావం

81చూసినవారు
కంచిలి: 'ఆపరేషన్ సింధూర్'కు నర్తు రామారావు సంఘీభావం
శ్రీకాకుళం జిల్లా కంచిలిలో గురువారం ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా, ఎమ్మెల్సీ నర్తు రామారావు వ్యాపారులు, వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. భారతీయులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతున్నామన్నారు. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ డాక్టర్ దాస్, కంచిలి ఎంపీపీ దేవదాసు రెడ్డి, జడ్పీటీసీ లోలాక్షి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్