ఇటీవల శ్రీనగర్ బారాముల్లా జిల్లా, ఆదిపురాలో చేపట్టిన 32 రాష్ట్రీయ రైపైల్ ఆపరేషన్లో పాల్గొని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను అంతమొందించారు. ఇందులో సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీ చిన్న మామిడిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ బొడ్డు దొరబాబుకు అతివిశిష్టమైన సేవా మెడల్, సేవా మెడల్ను లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చేతుల మీదుగా అందుకున్నట్లు జవాన్ శనివారం తెలిపారు.