శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన 9మంది కార్మికులు మస్కట్లో మోసపోయి ఇబ్బందులు పడుతుండగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు. వారికి వసతి, ఆహారం ఏర్పాటు చేయడంతో పాటు, వారి స్వస్థలానికి తిరిగి రావడానికి అయ్యే ఖర్చులను కూడా భరించారు. కార్మికులు శుక్రవారం సురక్షితంగా తమ కుటుంబాలను చేరుకున్నారు. దీనిపై ఇచ్చాపురంలోని వారి కుటుంబ సభ్యులు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.