ఇచ్ఛాపురం మండలం గుల్లలపాడులో శనివారం ఆస్తి తగాదా ఘటనలో ఇద్దరు మహిళలపై వారి కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచారు. గుల్లలపాడు గ్రామానికి చెందిన శిష్టు వాసుదేవరావుకు ఇద్దరు భార్యలు. కుటుంబ సభ్యుల ఆస్తి పంపకాల్లో మొదటి భార్యకు 45 సెంట్లు పంట భూమి ఇచ్చారు. ఈ పొలంలో విత్తనాలు చల్లుతున్న క్రమంలో రెండో భార్య కొడుకు ఆయన పిల్లలు మొదటి భార్య నీలమ్మ ఆమె కూతురు అరుణపై దాడి చేయటంతో వీరిద్దరూ గాయపడ్డారు.