ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించకపోవడం వలన చాలామంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించి నరసన్నపేట బార్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. వాహనాలు నడపటం వల్ల ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మండల కేంద్రంలో హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.