నరసన్నపేటలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలకు సన్నబియ్యం పంపిణీ వేగంగా కొనసాగుతోందని డిప్యూటీ తహశీల్దార్ సంధ్య తెలిపారు. బుధవారం నరసన్నపేటలోని 82 పాఠశాలలకు 456 ప్యాకెట్లు, పోలాకిలో 95 పాఠశాలలకు 393, జలుమూరులో 78 పాఠశాలలకు 341, సారవకోటలో 51 పాఠశాలలకు 346 ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. జావా కోసం రాగి కూడా ఇచ్చినట్లు తెలిపారు.