నరసన్నపేట: ఎంఎల్ఎస్ కేంద్రాన్ని పరిశీలించిన మేనేజర్

77చూసినవారు
నరసన్నపేట: ఎంఎల్ఎస్ కేంద్రాన్ని పరిశీలించిన మేనేజర్
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఎం ఎల్ ఎస్. గోదామును జిల్లా మేనేజర్ టి వేణుగోపాల్ ఆకస్మికంగా పరిశీలించారు. మంగళవారం సాయంత్రం గోదాంలో ఉన్న నిల్వలను తనిఖీ చేసి ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న సన్నబియ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రం ఆధ్వర్యంలో నరసన్నపేట, జలుమూరు మండలాలకు 179 పాఠశాలలకు 25 కేజీల బ్యాగులు 1417 వచ్చాయని డీటీ సంధ్య తెలిపారు. వీటిని ఆయా పాఠశాలలకు తరలిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్