నరసన్నపేట మండలం గొట్టిపల్లి పంచాయతీ సమీపంలో ఉన్న కప్ప కర్ర చెరువు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ గా మార్చేసారని బెందాళం నారాయణరావు ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సత్యవరం కు చెందిన తన తండ్రి జమీందారు బెందళం రామస్వామి నాయుడు దంపతులు ప్రజల దాహార్తి తీర్చేందుకుగాను 7 ఎకరాల 60 సెంట్లు తమ సొంత భూమిలో ఉన్న చెరువును దానం చేశారని అన్నారు. నేడు కొందరు ఆక్రమించుకున్నారని, అది కోర్టులో కేసు ఉందన్నారు.